ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం పైన ఆదేశాలిచ్చారు. కొవిడ్బారిన పడి అర్ధాంతరంగా కన్నుమూసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాల్లోని అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని ఆదేశించారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n644iN
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment